సంస్కృతసూక్తిరత్నకోశః – ప్రథమా మంజూషా-21
అఙ్కేషు శూన్యవిన్యాసాద్ వృద్ధిః స్యాత్తు దశాధికా ।
తస్మాద్ జ్ఞేయా విశేషేణ అఙ్కానాం వామతో గతిః ॥21॥
తాత్పర్యము-
అంకె ప్రక్క సున్న ఉంచితే దాని విలువ పదేసి రెట్లు పెరుగుతుంది. అందుచేత
అంకెలను లెక్క పెట్టేటప్పుడు కుడినుంచి ఎడమకు వెళ్ళాలి.
ఉదాహరణకు కొన్ని అంకెలు
చెప్పడానికి సంస్కృతంలో కొన్ని సాంకేతికపదాలు వాడతారు. చంద్రుడు అంటే ఒకటి.
సూర్యుడు = 2, బాణాలు= ఐదు, అగ్ని= 3
ఇత్యాదులు. ఎక్కడనైనా “బాణాగ్నిచంద్ర" అని అన్నట్లయితే
5,3,1 అని అంకెలు వేసుకొని వాటిని కుడినుంచి ఎడమకు చదివితే 135 అవుతుంది.
No comments:
Post a Comment